డి హిరేహాల్ మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నీ కుటుంబ సభ్యులకు నమస్కారములు🙏🙏🙏
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 10 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది.
జననేత శ్రీ వైఎస్ జగన్ గారి నేతృత్వంలో మన పార్టీ గడచిన పదేళ్ళలో ఎన్నో సవాళ్ళను అధిగమించి సంపూర్ణ ప్రజా బలంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అధికారం చేపట్టిన 20నెలల అతి స్వల్ప కాలంలోనే పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 90శాతాన్ని మన పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ గారు పూర్తి చేసి దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా శ్రీ వైఎస్ జగన్ గారు అమలు పరుస్తూ... మన పార్టీ పట్ల ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతూ... మనం గర్వంగా తలెత్తుకు తిరిగేలా తిరుగులేని పాలన అందిస్తున్నారు.
ఈ క్రమంలో వచ్చిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన అవసరం ఉంది.
రేపు అనగా 12-03-2021 న డి.హిరేహాల్ మండలంలో ఉన్న అన్ని గ్రామ పంచాయితి సర్పంచ్లు, మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించాలని కోరుతున్నాము
సమయం.... డి,హిరేహాల్ మండలం కేంద్రంలో ఉదయం 9-00 గంటలకు వైఎస్ఆర్ విగ్రహానికి రంగులు వేసి పూలమాలలు వేసి జెండా ఎగర వెయు కార్యక్రమ జరుగును
కావున మండల పరిధిలో అన్ని గ్రామాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మరియు శ్రేయోభిలాషులు అభిమానులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని విజయవంతం చేయాలని కోరుచున్నాము
Note:-
ఈ కార్యక్రమాన్ని మండల పాత్రికేయ మిత్రులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు పాల్గొని కవర్ చేయవలసినదిగా కోరుతున్నాము
ఇట్లు
M. వన్నూరు స్వామి గారు
డి,హిరేహాల్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్🇸🇱🇸🇱🇸🇱
Comments
Post a Comment